“మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి”. (ఫిలిప్పీ 3:1)
దేవునిలో మనం ఆనందించడం ద్వారా ఆయన మహిమపరచబడతాడని నాకు ఎవరూ బోధించలేదు, దేవునిలో ఉండే ఆ ఆనందమే మన స్తుతులు దేవునికి ఘనతను తెస్తాయే గానీ వేషధారణను కాదు.
అయితే, జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు చాలా స్పష్టంగా, శక్తివంతంగా చెప్పిన విషయం ఏంటంటే:
దేవుడు రెండు విధాలుగా తాను సృష్టించిన జీవుల ద్వారా తనను తాను మహిమపరుచుకుంటాడు: (1) వారి అవగాహనలో… కనిపించడంలో; (2) వారి హృదయాలకు తనను తాను తెలియజేయడంలో మరియు వారు ఆనందపడటంలో, సంతోషించడంలో మరియు తన గురించి తాను ప్రత్యక్షపరచుకున్నవాటిలో ఆనందించడంలో. . . కనిపిస్తున్న తన మహిమ ద్వారా మాత్రమే దేవుడు మహిమపరచబడడు గాని ఆ మహిమలో ఆనందించడం ద్వారా కూడా మహిమపరచబడతాడు….
ప్రజలు దేవుని మహిమను చూసినప్పుడు కంటే దానిని ఆనందించినప్పుడు దేవుడు మరింత ఉన్నతమైనవాడు. దేవుని మహిమ గురించి సాక్ష్యమిచ్చే వ్యక్తి దేవుణ్ణి మహిమపరచవలసినంతగా మహిమపరచడు ఎందుకనగా దానిలో ఆనందించకుండా కేవలం సాక్ష్యం మాత్రమే ఇస్తున్నాడు.
ఇది నేను కనుగొన్న అద్భుతమైన ఆవిష్కరణ. విశ్వంలో అత్యంత విలువైన విషయంగా నేను దేవుణ్ణి మహిమపరచాలనుకుంటే నేను తప్పనిసరిగా ఆయనలో ఆనందించుటను కొనసాగించాలి. ఆనందం అనేది ఆరాధనలో ఒక ఎంపిక కాదు. ఇది ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన భాగం. నిజానికి ఆరాధనకున్న అతి ప్రాముఖ్యమైన ఆధారం ఏంటంటే దేవుని మహిమలో ఆనందించడం.
దేవుని స్తుతించే వాటియందు ఎటువంటి ఆనందాన్ని కనపరచనివారి కోసం ఒక పేరు ఉంది, ఆ పేరు ఏంటంటే వేషధారులు. “వేషధారులారా – ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే” (మత్తయి 15:7-8) అని యేసు చెప్పాడు. ప్రామాణికమైన స్తుతి అంటే పరిపూర్ణమైన ఆనందం మరియు దేవుని మహిమ కోసం ఈ ఆనందాన్ని గాఢంగా అనుభవించడమే మనిషి యొక్క అత్యున్నత లక్ష్యం అనే ఈ వాస్తవం బహుశా నేను కనుగొన్న అత్యంత స్వతంత్రతనిచ్చే ఆవిష్కరణ.