“గొఱ్ఱల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్”. (హెబ్రీయులు 13:20–21)
క్రీస్తు నిత్య నిబంధన రక్తాన్ని చిందించాడు. ఈ విజయవంతమైన విమోచన ద్వారా, ఆయన చనిపోయినవారి నుండి తన స్వంత పునరుత్థానం యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు. అది ఇంగ్లీషులో ఉన్నదాని కంటే గ్రీకులో మరింత స్పష్టంగా ఉంది: “దేవుడు . . . మన ప్రభువైన యేసును మృతులలోనుండి తిరిగి తెచ్చెను . . . శాశ్వతమైన నిబంధన రక్తం ద్వారా. ఈ యేసు – నిబంధన రక్తం ద్వారా లేపబడ్డాడు – ఇప్పుడు మన ప్రభువు సజీవుడు మరియు మన కాపరి.
మరియు వీటన్నిటి కారణంగా, దేవుడు రెండు కార్యాలు చేస్తాడు:
1. మనము ఆయన చిత్తము చేయునట్లు ఆయన మనకు సమస్త మంచిని సమకూర్చును,
2. ఆయన దృష్టికి ఏది ఇష్టమో అది మనలో పని చేసేలా చేస్తాడు.
క్రీస్తు రక్తం ద్వారా సంపాదించిన “నిత్య నిబంధన”యే కొత్త నిబంధన. మరియు కొత్త నిబంధన వాగ్దానం ఇది: “వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను”(యిర్మీయా 31:33). కాబట్టి, ఈ నిబంధన యొక్క రక్తం దేవుడు తన చిత్తాన్ని చేయడానికి మనల్ని సన్నద్ధం చేయడమే కాకుండా, ఆ సన్నద్ధతను విజయవంతం చేయడానికి కూడా దేవుడు మనలో పని చేస్తున్నాడు.
దేవుని కృపతో ఆయన సంకల్పం కేవలం రాయి లేదా కాగితంపై వ్రాయబడలేదు. అది మనలో పని చేస్తుంది. మరియు దీని ప్రభావం ఏమిటంటే: మనం దేవునికి మరింత నచ్చే విధంగా భావిస్తాము, ఆలోచిస్తాము మరియు ప్రవర్తిస్తాము.
“భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి” అని చెప్పడం ద్వారా ఆయన ఇచ్చే పరికరాలను ఉపయోగించమని మనకు ఇప్పటికీ ఆజ్ఞాపించబడింది. కానీ చాలా ముఖ్యమైన ‘ఎందుకు’ అనేది మనకు చెప్పబడింది: “ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.” (ఫిలిప్పీయులు 2:12-13).
మనం దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే – మనం ఆయన దయాసంకల్పము నెరవేరుస్తే – అది రక్తంతో కొనుగోలు చేసిన దేవుని కృప కేవలం సన్నద్ధం చేయడం మాత్రమే కాకుండా శక్తిమంతమైన రూపాంతరం చెందడానికి కూడా సహాయం చేస్తున్నాడు.