“అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”. (మార్కు 10:29–30)
యేసు చెప్పిన ఈ మాటల అర్థం ఏమిటంటే, మీరు చేసే ప్రతి త్యాగానికి ఆయనే ప్రతిఫలం ఇస్తాడు.
- మీరు తల్లి ఆప్యాయతను, శ్రద్ధను వదులుకుంటే, మీరు నిత్యుడైన క్రీస్తు నుండి వంద రెట్లు ఆప్యాయతను, శ్రద్ధను తిరిగి పొందుతారు.
- మీరు సహోదరుని స్నేహాన్ని వదులుకుంటే, మీరు క్రీస్తు యొక్క ప్రేమను, స్నేహాన్ని వంద రెట్లు తిరిగి పొందుతారు.
- మీరు మీ ఇంటిలో ఉన్న అనుభవాన్ని వదులుకుంటే, మీ ప్రభువు ప్రతి ఇంటిని కలిగి ఉన్నారని తెలుసుకోవడం ద్వారా మీకు వంద రెట్లు సౌలభ్యం, భద్రత లభిస్తుంది.
“మీరు ఫలానా త్యాగాలను చేశాను అని ఇంకెప్పుడు చెప్పకోలేని విధంగా నేను మీ కోసం కార్యాలు చేస్తానని, నేను మీ కోసం ఉంటానని వాగ్దానం చేస్తున్నాను” అని కాబోయే మిషనరీలకు యేసు చెప్తున్నాడు.
పేతురు “త్యాగానికి” యేసు వైఖరి ఏమిటి? పేతురు అన్నాడు, “ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి” (మార్కు 10:28). యేసు మెచ్చిన “స్వీయ నిరాకరణ” స్ఫూర్తి ఇదేనా? ఇది కాదు, ఎందుకంటే యేసు పేతురును మందలించాడు.
యేసు పేతురుతో ఇలా అన్నాడు, “నేను వందరెట్లు తిరిగి చెల్లించనంతగా ఎవ్వరూ నా కోసం దేనినీ త్యాగం చేయలేరు – అవును, ఒక విధంగా ఈ జీవితంలో చాలా పొందుకుంటారు, రాబోయే యుగంలో నిత్యజీవం గురించి ఇంక చెప్పాల్సిన పని లేదు.”







